Sunday, April 5, 2015

ఆంథ్ర వ్యాకరణమునకు శ్రీ కారం

శ్రీ మహా గణపతయే  నమః
శ్రీ మహా సరస్వత్యై నమః 
శ్రీ గురుభ్యో నమః 
శ్రీ రామ జయం 

శ్రీ గీర్వాణ భాష ప్రపంచములోని అన్ని భాషలకన్నా  అతి ప్రాచీనమైనది.  శృతి పరంపరగా  అనేక తరాలనుండి కొన సాగుతున్న వేదవిద్యకు శబ్ద శుద్ధి చాల ఆవశ్యకమైనది.  దీన్ని ఆధారం చేసుకుని అర్థము ఉన్నది. 

వైదికమైన శ్రుతి విద్యను, యజ్ఞ సంస్కృతిని  నిలపటానికి వేదాంగములు ఏర్పడ్డాయి. 

ఈ వేదాంగములు ఆరు: 
1. జ్యోతిషము 
2. కల్పము 
3.ఛందస్సు 
4. శిక్షా 
5. వ్యాకరణము 
6. నిరుక్తము 

 
మొదటి రెండూ (జ్యోతిషము, కల్పము)  ఈ నాటి ఆధునిక విజ్ఞానమున వాడబడే గణితమును  కలిగి ఉన్నవి. 
ఛందస్సు, శిక్షా , వ్యాకరణము, నిరుక్తము అనెడి నాలుగు కేవలము శబ్ద శుద్ధి మరియు శబ్ద అర్థముకొరకు ఉద్దేశింపబడినవి. 
నిరుక్తము అతి ప్రాచీనమై నేటి 'Etymology' కి మూలమైనది. 
శిక్ష ప్రతి అక్షరాన్ని ఎలా పలకాలో చెపుతుంది , ఇది నేటి 'phonetics' కి మూలం. 
ఛందస్సు మంత్ర రూపమైన వేద విద్య కూర్పును అర్థము చేసుకొనుటకు ఉపయోగపడుతుంది. 
వ్యాకరణము పద నిర్మాణాన్ని, అర్థాన్ని నిలపడానికి ఉద్దేశించినది. 

 ఈ వేద భాషకు చెందిన ప్రాచీనమైన క్రింది నవ (తొమ్మిది) వ్యాకరణములలో  ఎనిమిది ఇప్పుడు అదృష్టములు.
 
ఐంద్రం చాంద్రం కాశకృత్స్నం కౌమారం శాకటాయనం । 
సారస్వతం చాపిశలం శాకల్యం పాణినీయకం ॥ 
 
వీటిలో ఇపుడు కేవలము పాణిని వ్యాకరణము మాత్రము లబ్దము.

నేటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లకు మించిన పాణిని వ్యాకరణమును  చూసి  పాశ్చాత్యులు ఇప్పటికీ అబ్బురపడుతున్నారు.      
ఇవికాక శ్రీ పాణిని తన వ్యాకరణ గ్రంథములో అనేక ప్రాచీన వ్యాకరణాచార్యులను పేర్కొన్నారు. వారు ఆపిశలి, కాశ్యపుడు , గార్గుడు , గాలవుడు , చాక్ర వర్మణుడు , భారద్వాజుడు, శాకటాయనుడు , శాకల్యుడు , సేనకుడు ,స్ఫోటాయనుడు . అనేక వైదిక ప్రతిశాఖ్య గ్రంథాల నుండి పాణిని ముందు 59 మంది వైయ్యాకరణులను చెప్పడం జరిగింది.  వీరి గ్రంథాలు అలభ్యములు మరియు  నేర్చిన వారు   ఇపుడు లేరు .   
తమిళ భాష నిర్మాణమునకు అగస్త్యులు వాడినది 'ఐమ్ద్ర వ్యాకరణము '.తెలుగు భాషకు వాడినది 'పాణినీయము ' . 
 
తెలుగు భాషనిర్మాణానికి  గీర్వాణాన్ని వాడి చాల అందమైన భాషగా తయారవటానికి కారణము ప్రాచీనతమమైన ఆంధ్ర చరిత్ర  :

1. ఋగ్వేదములో ఆంధ్ర శబ్దము ఒక తెగకు వాడబడినది
2. మహా  భారత కాలములో ఆంధ్రులు రాజరికం చేసేవారు .  మల్ల విద్యా విశారదులైన చాణూర ముష్టికులు ఆంధ్రులు.  ఇది కలియుగ ఆరంభము అనగా 5116 పూర్వపు మాట.  
3. మౌర్య యుగములో మెగస్తనీస్ వ్రాతల బట్టి ఆంధ్రులు పరాక్రమవంతులైన రాజులు 
4. శాత వాహనులు (200BC -200 AD )
5. ఆ తర్వాత 625 AD  వరకు వరుసగా ఇక్ష్వాకులు , పల్లవులు , బృహత్పలాయనులు , ఆనంద గోత్రీకులు , శాలంకాయనులు , విష్ణు కుండినులు పాలించారు. 
6. తూర్పు చాళుక్యులు 625 నుండి 1118 వరకు పాలించారు. (రాజ రాజ నరేంద్రుడు వీరి వంశము వాడు, అతని కాలంలో శ్రీ నన్నయ తెలుగు భాషకి సంస్కృతభాష ఆధారంగా మొదటి వ్యాకరణము రచించారు  ) 
7.  కాకతీయులు (1000-1323 AD ) మరియు వెలనాటి చోడులు 1206 AD వరకు 
8. రెడ్డి రాజులు 
9. విజయనగర సామ్రాజ్యము (1565 AD వరకు )

పై అందరూ వైదిక సంస్కృతిని సంస్కృతము , తెలుగు భాషల ను పోషించిన వారు. అందు వలన పద్యము, అవధానము వంటి  వైదిక కళలు ఆంధ్రులకి సొంతమైనవి.  

ఆ తర్వాతి కాలంలొ గోల్కొండ నవాబులు, బ్రిటిషు సర్కారు   పాలనల్లో భాష క్రమముగా కాస్తంత తగ్గుముఖం పట్టినా కొందరు సంస్థానాధీశుల చలువ వల్ల పూర్తిగా కనుమరుగవలేదు. 
 
10. గోల్కొండ నవాబులు మరియు చిన్న ఆంధ్ర సంస్థానాలు (1565 AD  నుంచి 1800 AD వరకు ) 
11. బ్రిటిషు సర్కారు మరియు చిన్న ఆంధ్ర సంస్థానాలు (1800 AD నుంచి 1947 AD వరకు )

ఆపైన స్వతంత్ర భారత నాయకుల, ప్రజలకు అవగాహనలేమి  వల్ల పెద్ద పోషణ లేదు . అందువల్ల భాషామ తల్లి  మంచమెక్కింది. 


శ్రీ నన్నయ క్రీ .శ 1020 ప్రాంతములో పాణిని సంస్కృత వ్యాకరణము ఆధారము చేసుకొని,  తొలి తెలుగు వ్యాకరణమును "ఆంధ్ర శబ్ద చింతామణి " అనే  గ్రంథము  రూపములో అందించారు.

1800 వరకు ఈ వ్యాకరణ సూత్రాల ఆధారముగా అనేక ప్రముఖ తెనుగు కవులు రచన చేసారు. 

 ఆ తర్వాత మరింత సులభముగా ఈ  నన్నయ వ్యాకరణము ప్రజలకు అర్థమవుటకు 'శ్రీ పరవస్తు చిన్నయ సూరి '  (1807–1861) వారు 'బాల వ్యాకరణాన్ని' వ్రాసారు. తెలుగు సూత్రాల రూపంలో పొందు పరచబడిన ఈ గ్రంథము  తెలుగు వ్యాకరణానికి ఈనాటి మార్గ దర్శి.

ఇప్పుడు మనం అన్ని గ్రంథాలు  కలబోసి  సులభమైన పద్ధతిలో మనం విహంగ వీక్షణం చేద్దాం.

ఏ వ్యాకరణములోనైనా మొదట తెలుసుకోవలసినది  "సంజ్ఞ".అంటే భాషకి చెందిన గుర్తులని అర్థం. 


సంజ్ఞా ప్రకరణము

వర్ణము : సంస్కృతములో ఒక సారి ఉచ్చరించడానికి వీలైన శబ్దాన్ని "వర్ణము"  అన్నారు  
ఉదా: క్ , అ   ;

వర్ణాలని  కలిపితే  ఒక అక్షరము అవుతుంది.   "క్ + అ = క"

వర్ణ సమామ్నాయము : వర్ణాల సముదాయము . సంస్కృతము యొక్క 50 మరియు 6 తెనుగుకి చెందిన వర్ణాలు కలిపి 56 అక్షరాలతో ఏర్పాటైన ఘనమైనది ఆంధ్ర వర్ణ మాల . 

వీటిలో స్వరములు/ప్రాణములు/అచ్చులు   మరియు వ్యంజనములు/ప్రాణులు/హల్లులు  అని రెండు రకములు.  


వైదిక బ్రాహ్మీ వర్ణ మాల:

 ప్రస్తుతము ఆంగ్లము మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఉపయోగించే లాటిన్ వంటి  లిపుల్లో పలికేదొకటి రాసేదొకటి.దానికి కారణము వారి బలహీనమైన 26 letters.   

కానీ భారతీయ భాషలు ఏమి పలకాలో అదే వ్రాస్తారు .అదే మన 16 స్వరములతో కూడిన వర్ణమాల శక్తి .ఇలాంటి వర్ణ మాల కొన్ని వేల సంవత్సరాల ముందు భారతీయుల ఆవిష్కరణ .

 దక్షిణాన శ్రీలంక  నుంచి ఉత్తరాన టిబెట్ వరకు పడమర ఆఫ్రికాలోని  కొన్ని ప్రాంతాల నుండి  తూర్పున కంబోడియా వరకు వాడే అన్ని భాషలు,  ఈ వైదికమైన బ్రాహ్మి లిపి యొక్క వర్ణము/అక్షరములను ఆధారము చేసుకొన్నవే.  

దీని ఆధారంగా భారత దేశములో అనేక ఆవిష్కరణలు జరిగాయి 
మచ్చుకు ఒకటి ఆర్యభట్టీయం :




మహేశ్వర సూత్రములు :

పాణిని మహర్షికి శ్రీ పరమేశ్వరుని ఢమరుక నాదముతో బోధించిన మహేశ్వర సూత్రాలు 'అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణానికి మూలం. ఇవి 14 సూత్రాలు :

1 నుండి 4 వ సూత్రము  వరకు ఉన్న వర్ణాలని అచ్ ప్రత్యయము ద్వారా సంస్కృత వ్యాకరణ సూత్రాలలో వాడుతారు. దీన్నే నన్నయ వారు అచ్చులుగా తెలుగు స్వరములకి పేరు పెట్టారు. 
  
 ఇ ఉ ణ్ - 1
ఋ ఌ క్ -  2
ఏ ఓ ఙ్గ్ -  3
ఐ ఔ చ్  - 4

5 నుండి 14 వ సూత్రము  వరకు ఉన్న వర్ణాలని హల్  ప్రత్యయము ద్వారా సంస్కృత వ్యాకరణ సూత్రాలలో వాడుతారు. దీన్నే నన్నయ వారు హల్లులుగా తెలుగు వ్యంజనములకు  పేరు పెట్టారు. 


య వ ర ట్  - 5
లణ్ - 6
ఞమ గ ఙ న  మ్ -7
ఝ భ య్న్ - 8
ఘ ఢ ధ ష్ - 9
జ బ గ డ ద శ్ -10
ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్  -11
క ప య్ -12
శ ష స ర్ -13
ల్ -14
 


ఇపుడు తెలుగు వర్ణ మాల ఇలా ఉంటుంది 

అచ్చులు /స్వరములు /ప్రాణములు :


అ  - తల కట్టు           

ఆ   ా - దీర్ఘము 

ఇ    ి - గుడి 

   ీ -గుడి దీర్ఘము 

ఉ   ు - కొమ్ము 
  ూ - కొమ్ము దీర్ఘము 
ృ - వట్ర సుడి 

ౄ - వట్ర సుడి  దీర్ఘము 

ఌ   ౢ - ఌకారము  

 ౡ    ౣ -ఌకార దీర్ఘము 
       
ఎ  ై -  ఎత్వము 

  ే -ఏత్వము 

    ై -ఐత్వము 

 ఒ  ొ - ఒత్వము 
ఓ   ో  - ఓత్వము 
 ౌ  -ఔత్వము 
 అం ం -అనుస్వారము 

అఁ ఁ -అర్ధానుస్వారము 

 అః ః  -విసర్గ 


హల్లులు/ప్రాణులు (పైన ప్రాణాల మీద ఆధార పడి బ్రతికేవి కనుక)/వ్యంజనములు :

పైన గల అచ్చులను క్రింద గల హల్లులు అనే వర్ణాలతో గుణిమ్చటము (carteasean product (or) Acchulu Cross Hallulu) వలన గుణింతాలు ఏర్పడ్డాయి . 

క్ ఖ్ గ్ ఘ్    -----+అ= --------}   క ఖ గ ఘ ఙ

చ్ ఛ్ జ్ ఝ్  ----+అ=---} చ ఛ   జ  ఝ  ఞ  

 ౘ   ౙ

ట్ ఠ్ డ్ ఢ్  ణ్  --+అ=-----------}  ట  ఠ  డ   ఢ  ణ

త్ థ్ ద్ ధ్ న్     -------+అ=------} త  థ   ద   ధ   న

ప్ ఫ్ బ్ భ్ మ్ -----------+అ=--}  ప ఫ బ భ మ

య్ ర్ రర్ ల్ ళ్ వ్  -+అ=----}   య ర  ఱ ల ళ వ

 శ్ స్  హ్ క్ష్ త్ర్ జ్ఞ్   --+అ=---} శ ష స హ క్ష త్ర  జ్ఞ



తెలుగు అంకెలు :

౦  సున్నా  
౧  ఒకటి 
౨  రెండు 
౩   మూడు 
౪   నాల్గు 
౫   ఐదు 
౬   ఆరు 
౭   ఏడు లేదా ఆరున్నొకటి  
౮   ఎనిమిది 
౯   తొమ్మిది 


పై అచ్చులను పలికే తీరుబట్టి  మరియు పద్య నిర్మాణము కొరకు :

"హ్రస్వము /లఘువు - ఒక మాత్రా కాలము 
దీర్ఘము /గురువు - రెండు మాత్రల కాలము  
ఫ్లుతము   ఽ  - మూడు మాత్రల కాలము 

ఉచ్ఛము గా పలకటము ఉదాత్తము 
క్రిందకు పలకటము అనుదాత్తము 
సమముగా పలకటము స్వరితము "

గా పెద్దలు నిర్ణయించారు 

No comments:

Post a Comment